శనివారం మూడు జిల్లాల్లో జగన్ ప్రచారం..

శనివారం మూడు జిల్లాల్లో జగన్ ప్రచారం..
x
Highlights

ప్రచారానికి రెండురోజుల విరామం ఇచ్చిన జగన్ శనివారం నుంచి మళ్ళీ సుడిగాలి పర్యటనకు సిద్ధమయ్యారు. శనివారం మూడు జిల్లాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేస్తారని...

ప్రచారానికి రెండురోజుల విరామం ఇచ్చిన జగన్ శనివారం నుంచి మళ్ళీ సుడిగాలి పర్యటనకు సిద్ధమయ్యారు. శనివారం మూడు జిల్లాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేస్తారని వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ ప్రోగ్రాం కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో వైఎస్‌ జగన్‌ పర్యటించనున్నారని..

ఉదయం 9.30 గంటలకు పలాస(శ్రీకాకుళం)లో.. అనంతరం 11.30 గంటలకు పాడేరు(విశాఖపట్నం)లో.. మధ్యాహ్నం 2 గంటలకు పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ఆయన తెలిపారు. ఇదిలావుంటే గురు, శుక్రవారం జగన్ ప్రచారానికి దూరంగా ఉన్నారు. మానిఫెస్టోకు తుదిమెరుగులు దిద్దుతున్న జగన్ అందుకోసం గురువారం విరామం తీసుకున్నారు. అలాగే శుక్రవారం పులివెందులలో నామినేషన్ సందర్బంగా జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే పులివెందులలో జరిగిన భారీ భహిరంగసభలో ఆయన ప్రసంగించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories