వైసీపీ అగ్రనేతల పర్యటన వివరాలు..

వైసీపీ అగ్రనేతల పర్యటన వివరాలు..
x
Highlights

వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ప్రచారంలో దూకుడు పెంచారు. బుధవారం మూడు జిల్లాలు.. గుంటూరు, ప్రకాశం, కృష్ణా లో ఆయన ఎన్నికల ప్రచారం...

వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ప్రచారంలో దూకుడు పెంచారు. బుధవారం మూడు జిల్లాలు.. గుంటూరు, ప్రకాశం, కృష్ణా లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు గుంటూరు జిల్లా సత్తెనపల్లి, 11.30 గంటలకు గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల, మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రకాశం జిల్లా ఒంగోలు, 3.30 గంటలకు కృష్ణా జిల్లా మైలవరంలో ఏర్పాటుచేసే బహిరంగ సభల్లో జగన్‌ ప్రసంగించనున్నారు.

అలాగే వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ నేడు విజయనగరం, విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు.. బుధవారం విజయనగరం జిల్లాలోని గజపతినగరం, విశాఖ జిల్లాలోని మాడుగుల, చోడవరం శాసనసభా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఇక షర్మిల ప్రచారం నేడు పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలో సాగనుంది. పశ్చిమగోదావరి జిల్లాలోని దెందులూరు, కృష్ణా జిల్లాలోని కైకలూరు, పెడన నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేస్తారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories