నేడు 2 జిల్లాల్లో వైఎస్‌ జగన్‌ ఎన్నికల ప్రచారం.. సాయంత్రం..

నేడు 2 జిల్లాల్లో వైఎస్‌ జగన్‌ ఎన్నికల ప్రచారం.. సాయంత్రం..
x
Highlights

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం రెండు జిల్లాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. మొత్తం మూడు బహిరంగ సభల్లో పాల్గొని ఎన్నికల ప్రచారం...

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం రెండు జిల్లాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. మొత్తం మూడు బహిరంగ సభల్లో పాల్గొని ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఉదయం 9.30 గంటలకు రేపల్లె (గుంటూరు జిల్లా), 11.30 గంటలకు చిలకలూరిపేట (గుంటూరు), మధ్యాహ్నం 2.00 గంటలకు తిరువూరులో (కృష్ణా జిల్లా) జరిగే బహిరంగ సభల్లో జగన్‌ పాల్గొంటారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ ప్రోగ్రాం కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా ఆదివారం సాయంత్రం మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో భేటీ అయ్యాయి అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories