నిత్య పెళ్లి కొడుకు గుట్టు రట్టు...ఇప్పటికే మూడు పెళ్ళిళ్ళు..

నిత్య పెళ్లి కొడుకు గుట్టు రట్టు...ఇప్పటికే మూడు పెళ్ళిళ్ళు..
x
Highlights

పెళ్లి అనే మాటకు విలువలేకుండా పోతుంది. ఒక్కప్పటి కాలంలో పెళ్ళికి వున్న విలువ ప్రస్తుత కాలంలో లేదు.

పెళ్లి అనే మాటకు విలువలేకుండా పోతుంది. ఒక్కప్పటి కాలంలో పెళ్ళికి వున్న విలువ ప్రస్తుత కాలంలో లేదు. భారత దేశంలో పాశ్చాత్య పోకడలు పెరిగిపోతున్నాయి. ఒకరికి తెలియకుండా మరోకరిని పెళ్లి చేసుకుంటున్నారు. అదే కోణంలో ఇక్కడ ఓ ప్రబుధుడు ఒక్కరినో, ఇద్దరినో కాదు ఏకంగా ముగ్గురు అమ్మాయిలకు తాళికట్టాడు.

అనంతపురం జిల్లా గోరంట్ల మండలం బుద్దివాండ్ల పల్లికి చెందిన రంగప్ప అనే వ్యక్తి నిత్య పెళ్ళికొడుకు అవతారమెత్తాడు. ఫోన్ కాల్స్‌ ద్వారా యువతులను పరిచయం చేసుకునే వాడు. వారిని మెల్లిగా ప్రేమిస్తున్నానని నమ్మించి పెళ్లి చేసుకునేవాడు. కొన్ని రోజుల తర్వాత డబ్బు, బంగారంతో పారిపోయి వేరే అమ్మాయిలను ట్రాప్ చేసేవాడు. అదే విధంగా ముగ్గురు అమ్మాయిలను ఇదివరకే ఒకరికి తెలీకుండా ఒకరిని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. ఇంతటితో ఆగకుండా అనంతపురానికి చెందిన మరో అమ్మాయితో నాలుగో పెళ్లికి సిద్ధమయ్యాడు ఆ నిత్యపెళ్లికొడుకు.

ఆ ప్రభుధ్దుని విషయం తెలుసుకున్న మూడో భార్య నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిత్యపెళ్లికొడుకు రంగప్పను అరెస్ట్‌ చేశారు.అమ్మయిలను మోసం చేసి పెళ్లి చేసుకోవడమే కాకుండా ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చాలా మంది నిరుద్యిగుల నుంచి రూ.10లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయని పోలీసుల తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories