18 అవినీతి కేసుల్లో స్టేలు తెచ్చుకుని సుమతి శతకాలు వల్లిస్తున్నారు: విజయసాయిరెడ్డి

18 అవినీతి కేసుల్లో స్టేలు తెచ్చుకుని సుమతి శతకాలు వల్లిస్తున్నారు: విజయసాయిరెడ్డి
x
Highlights

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా ఘాటు విమర్శలు చేశారు. అందులో.. 'ఓటుకు నోటు కేసులో ఆడియో,...

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా ఘాటు విమర్శలు చేశారు. అందులో.. 'ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియో సాక్షిగా అడ్డంగా దొరికారని.. 18 అవినీతి కేసుల్లో స్టేలు తెచ్చుకుని సుమతి శతకాలు వల్లిస్తున్నాడని అన్నారు. చంద్రబాబునాయుడు 40 ఏళ్లుగా దోచుకుంటూనే ఉంటున్నాడని ఆరోపించారు. ప్రజలు గుర్తించబట్టే అధికారం పీకేసి తరిమికొట్టారని.. అయినా తండ్రీకొడుకులు రంకెలేస్తున్నారని మండిపడ్డారు. పరాజితులంతా చీకటి మాటున చేతులు కలిపి వీధుల్లో పెడబొబ్బలు పెడుతున్నారు. చూసే వాళ్లకు అసహ్యం వేస్తున్నా వారికి మాత్రం సిగ్గనిపించడం లేదని మరో పదేళ్లయినా ప్రజాభిమానం సంపాదించుకోలేరని విమర్శలు గుప్పించారు విజయసాయిరెడ్డి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories