దేవాన్ష్ ను తెలుగుమీడియంలో చదివిస్తామని చెప్పండి చూద్దాం? : ఎంపీ విజయసాయిరెడ్డి

దేవాన్ష్ ను తెలుగుమీడియంలో చదివిస్తామని చెప్పండి చూద్దాం? : ఎంపీ విజయసాయిరెడ్డి
x
Highlights

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, నారా లోకేష్ పై ట్విటర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటు విమర్శలు చేశారు. స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం చదువులు...

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, నారా లోకేష్ పై ట్విటర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటు విమర్శలు చేశారు. స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం చదువులు వద్దని వ్యతిరేకిస్తున్న వీరిద్దరూ దేవాన్ష్ ను ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు చదివిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.. అందులో.. 'మీ పిల్లల్ని మాత్రం ఇంగ్లిష్ మీడియంలోనే చదివిస్తారు. పేద పిల్లలు మాత్రం తెలుగులోనే చదవాలి. వాళ్లు ఉన్నత స్థాయికి ఎదగ కూడదు. విదేశాల్లో ఉన్నత చదువులకు వెళ్ల కూడదని కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు తండ్రీ కొడుకులు. దేవాన్ష్ ను తెలుగుమీడియంలో చదివిస్తామని చెప్పండి చూద్దాం?' అని అన్నారు

అంతేకాకుండా..'స్కూళ్ళలో చైనీస్, జపనీస్ భాషలను కూడా నేర్పించాలని చంద్రబాబునాయుడు వకాల్తా పుచ్చుకున్న విషయం లోకేష్ కి తెలిసి ఉండదు. ఎవరైనా పాత వీడియోలు చూపించి కాబోయే పార్టీ అధ్యక్షుడికి జ్ణానం ప్రసాదించండి కాస్త. నాలుక మడత పెట్టడంలో తండ్రికి మించి పోయాడు. అంటూ నారా లోకేష్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories