చంద్రబాబు మైండ్ అలాగే పనిచేస్తోంది : ఎంపీ విజయసాయిరెడ్డి

చంద్రబాబు మైండ్ అలాగే పనిచేస్తోంది : ఎంపీ విజయసాయిరెడ్డి
x
Highlights

టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి ట్వీట్లతో విరుచుకుపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఈ మేరకు ట్వీట్ లో ఘాటు

టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి ట్వీట్లతో విరుచుకుపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఈ మేరకు ట్వీట్ లో ఘాటు విమర్శలు చేశారు.. 'డ్వాక్రా ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించేందుకు 16 కంపెనీలతో చంద్రబాబు ప్రభుత్వం 2015 నవంబర్లో ఎంఓయూలు కుదుర్చుకుంది. వాల్మార్ట్, ఐటీసీ, మహీంద్ర&మహీంద్ర, ఓలం అగ్రో లాంటి దిగ్గజ కంపెనీలను పిలిపించి సినిమా చూపించాడు. ఒప్పంద పత్రాలు చెదలు పట్టాయి.కానీ కొనుగోళ్లు జరగలేదు అని విమర్శించారు.. అలాగే ఇసుకపై టీడీపీ చేస్తున్న ఆరోపణలపై కూడా ఘాటుగా స్పందించారు.. దొరక్క కూలీలు పస్తులుంటున్నారని చంద్రబాబునాయుడు అంటున్నారు. ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారని అదే నోటితో నింద చేస్తున్నారు.

అటు పొరుగు రాష్ట్రాలకు తరలి పోతుందని ఆరోపిస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడంలేదు. తను సృష్టించిన ఇసుక మాఫియా ఆదాయం కోల్పోయి బిక్క చూపులు చూస్తోందనేదే చంద్రబాబు అసలు బాధ.. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు, చిత్తుచిత్తుగా ఓడినా చంద్రబాబు గారి క్రిమినల్ మైండ్ షార్ప్ గానే పనిచేస్తోంది. నిరసన ప్రదర్శనలను కూడా ఔట్ సోర్సింగ్ ద్వారా మరో పార్టీతో చేయించే స్కెచ్ వేశాడు. లాంగ్ మార్చో, షార్ట్ మార్చో. స్పాన్సర్ చేసేది ఆయనే అని అందరికీ తెలిసిపోయింది.' అంటూ ట్వీట్ లో పేర్కొంటూ.. ఇసుక మీద చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు విజయసాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories