చంద్రబాబుపై ఎమ్మెల్యే రోజా ఫైర్‌.. చంద్రబాబుది విజన్‌ 420 అన్న రోజా

చంద్రబాబుపై ఎమ్మెల్యే రోజా ఫైర్‌.. చంద్రబాబుది విజన్‌ 420 అన్న రోజా
x
చంద్రబాబుపై ఎమ్మెల్యే రోజా ఫైర్‌
Highlights

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైరయ్యారు. అమరావతి అనే భమ్రలో ప్రజలను మోసం చేసి కేవలం గ్రాఫిక్స్‌తోనే ఐదేళ్లు కాలం గడిపారని...

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైరయ్యారు. అమరావతి అనే భమ్రలో ప్రజలను మోసం చేసి కేవలం గ్రాఫిక్స్‌తోనే ఐదేళ్లు కాలం గడిపారని మండిపడ్డారు. చంద్రబాబు విజన్‌ 2020 ఏంటో అమరావతి కుంభకోణంతోనే తేటతెల్లమైందన్నారు. చంద్రబాబుది 420 విజన్‌ అన్న రోజా రాయలసీమ ద్రోహిగా మిగిలిపోయారన్నారు.

మంగళగిరిలో వేలకోట్లు ఖర్చు పెట్టినా తన కొడుకు నారా లోకేష్‌ను గెలిపించుకోలుకపోయారని ఇంతకంటే రెఫరెండమ్‌ ఇంకేముంటుందన్నారు. కేవలం 20 మంది శాసనసభ్యులతో 20 గ్రామాలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఎంగా ఉండి అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పేరుతో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని విమర్శించారు. చంద్రబాబు ప్రతిపక్షనేతనా లేక పనికిమాలిన నేతనా అని రోజా నిలదీశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories