ఇటు వైసీపీ ఎమ్మెల్యే పాదయాత్ర.. అటు కారు బోల్తా..

ఇటు వైసీపీ ఎమ్మెల్యే పాదయాత్ర.. అటు కారు బోల్తా..
x
Highlights

పాణ్యం వైసీపీ ఎమ్మెల్యేకి చెందిన కారు బోల్తా పడింది. దీంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన శ్రీశైలం సమీపంలోని నంది ఘాటు మలుపు వద్ద జరిగింది. వైసీపీ...

పాణ్యం వైసీపీ ఎమ్మెల్యేకి చెందిన కారు బోల్తా పడింది. దీంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన శ్రీశైలం సమీపంలోని నంది ఘాటు మలుపు వద్ద జరిగింది. వైసీపీ అధికారంలోకి వస్తే శ్రీశైలం వరకు పాదయాత్ర చేస్తానని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామికి మొక్కుకున్నారు. అందులో భాగంగా ఆయన పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కాటసాని అనుచరులు కారులో శ్రీశైలానికి బయల్దేరారు. నంది ఘాట్‌ వద్దకు రాగానే కారు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు వైసీపీ కార్యకర్తలకు గాయాలవడంతో వారిని వెంటనే కర్నూల్‌ ఆస్పత్రికి తరలించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories