9 మందితో సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు రంగం సిద్ధం.. శాసన మండలి రద్దుకు వైసీపీ సర్కార్ మొగ్గు

9 మందితో సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు రంగం సిద్ధం.. శాసన మండలి రద్దుకు వైసీపీ సర్కార్ మొగ్గు
x
Highlights

9మందితో సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో సెలెక్ట్ కమిటీకి పేర్లు ఇవ్వాలని మండలి చైర్మన్ లేఖ రాశారు. రెండు బిల్లులకు...

9మందితో సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో సెలెక్ట్ కమిటీకి పేర్లు ఇవ్వాలని మండలి చైర్మన్ లేఖ రాశారు. రెండు బిల్లులకు సంబంధించి సెలెక్ట్ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ కమిటీలకు చైర్మన్లుగా సంబంధిత మంత్రులను నియమించనున్నారు.

మరోవైపు శాసన మండలి రద్దుకు వైసీపీ సర్కార్ మొగ్గు చూపుతోంది. మండలి రద్దుపై ముఖ్య నేతలతో సీఎం జగన్ చర్చిస్తున్నారు. రేపు ఉదయం మంత్రివర్గ సమావేశంలో మండలి రద్దుకు ఆమోదం తెలపనున్నట్టు తెలుస్తోంది. ఆసెంబ్లీలో తీర్మానం ఆమోదం పొందిన వెంటనే కేంద్రానికి పంపాలని యోచిస్తున్నారు. రేపు ఉదయం 9గంటలకు సచివాలయంలోని 1వ బ్లాక్‌లో కేబినెట్ సమావేశం జరగనుంది. కేబినెట్ సమావేశం అనంతరం అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని పెట్టి ఆమోదించే అవకాశం కనిపిస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories