రేపు ముఖ్యమంత్రితో యార్లగడ్డ భేటీ..

Highlights

గన్నవరం వైసీపీలో చిచ్చురేగింది. వైసీపీలోకి వల్లభనేని వంశీ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు గన్నవరం వైసీపీ ఇంచార్జి యార్లగడ్డ వెంకటరావు.. ఈ క్రమంలో...

గన్నవరం వైసీపీలో చిచ్చురేగింది. వైసీపీలోకి వల్లభనేని వంశీ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు గన్నవరం వైసీపీ ఇంచార్జి యార్లగడ్డ వెంకటరావు.. ఈ క్రమంలో గన్నవరం పార్టీ కార్యాలయంలో ఆయన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. రేపు(సోమవారం) ఉదయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో యార్లగడ్డ భేటీ అవుతారు. వంశీ వైసీపీలోకి వస్తే తన భవిశ్యత్ ఏంటనే విషయాలపై యార్లగడ్డ చర్చించనున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు టీడీపీకి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే.. ఎమ్మెల్యే పదవికి కూడా వల్లభనేని వంశీ రాజీనామా చేసిన వంశీ రాజకీయాలకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అయితే ఇదంతా సింపతీ కోసమే చేస్తున్నాడని యార్లగడ్డ వర్గం భావిస్తోంది. ఒకవేళ వంశీ వైసీపీలో చేరితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని యార్లగడ్డ వర్గం హెచ్చరిస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories