వైసీపీ తొలి జాబితా విడుదల వాయిదా.. ప్రకటన ఎప్పుడంటే..

వైసీపీ తొలి జాబితా విడుదల వాయిదా.. ప్రకటన ఎప్పుడంటే..
x
Highlights

ఇవాళ ప్రకటించనున్న వైసీపీ తొలి జాబితా వాయిదా పడింది. మొత్తం 100 మందికి పైగా అభ్యర్థులతో వైసీపీ తొలి జాబితాను ప్రకటించాలని అనుకుంది. కానీ టీడీపీనుంచి...

ఇవాళ ప్రకటించనున్న వైసీపీ తొలి జాబితా వాయిదా పడింది. మొత్తం 100 మందికి పైగా అభ్యర్థులతో వైసీపీ తొలి జాబితాను ప్రకటించాలని అనుకుంది. కానీ టీడీపీనుంచి చేరికల నేపథ్యంలో ఈనెల 16 కు వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఇందులో దాదాపు 40 మంది సిట్టింగులకు అవకాశం దక్కనున్నట్టు సమాచారం. తొలి జాబితాను ప్రకటించినరెండు రోజుల్లో మరో జాబితా ప్రకటించాలని వైసీపీ అనుకుంటోంది. తుది జాబితా ప్రకటించగానే వైసీపీ అధినేత జగన్ ఇడుపులపాయ వెళ్లాలని అనుకుంటున్నారు. ఇదిలావుంటే కాకినాడ ఎంపీ తోట నరసింహం, ఆయన సతీమణి వాణి, సినీనటుడు రాజారవీంద్ర, విజయవాడ మాజీ మేయర్‌ రత్నబిందు ఇవాళ ఆ పార్టీలో చేరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories