ఇరు వర్గాల మధ్య గొడవ.. వైసీపీ కార్యకర్త మృతి!

ఇరు వర్గాల మధ్య గొడవ.. వైసీపీ కార్యకర్త మృతి!
x
Highlights

ఇరు వర్గాల మధ్య గొడవ.. వైసీపీ కార్యకర్త మృతి! ఇరు వర్గాల మధ్య గొడవ.. వైసీపీ కార్యకర్త మృతి!

పుట్టగొడుగుల కోసం ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో వైసీపీ కార్యకర్త మృతిచెందాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలోని కుంటిభద్రలో జరిగిందీ. మంగళవారం పుట్టగొడుగుల విషయంలో గ్రామానికి చెందిన రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ రేగింది. కత్తులు, కర్రలతో దాడి చేసుకున్నారు. కొవ్వాడ యర్రయ్య అనే వ్యక్తి హిమగిరి, జంగంలపై బల్లెంతో దాడిచేశాడు. దీంతో జంగం తీవ్రంగా గాయపడ్డాడు.

వెంటనే అతన్ని పాలకొండ ఆసుపత్రికి తరలించగా చికిత్స అందిస్తుండగా మధ్యలోనే మృతి చెందాడు. జంగం ఇటీవలే టీడీపీని వీడి వైసీపీలో చేరినట్టు తెలుస్తోంది. అతడిపై దాడిచేసింది టీడీపీ వర్గీయులేని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు.ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు ప్రస్తుతం గ్రామంలో 144 సెక్షన్ విధించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories