Y S Sharmila: ఇవాళ ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన

Y S Sharmila Visit To Joint Kurnool District Today
x

Y S Sharmila: ఇవాళ ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన

Highlights

Y S Sharmila: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ న్యాయ యాత్ర

Y S Sharmila: ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ చేపట్టిన ఏపీ న్యాయ యాత్ర నేటి నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాలో సాగనుంది. ఈ యాత్ర అనంతపురం జిల్లా ఉరవకొండ నుంచి కర్నూలు జిల్లాలోకి ప్రవేశించింది. ఉదయం ఆలూరులో, సాయంత్రం ఆదోని, ఎమ్మిగనూరులో జరిగే కార్నర్ మీటింగ్‌లలో షర్మిల పాల్గొంటారు. ఇక రేపు ఆమె కడప జిల్లాలో పర్యటిస్తారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా రేపు నామినేషన్ దాఖలు చేస్తారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు కోడుమూరులో జరిగే కార్నర్ మీటింగ్‌లో పాల్గొంటారు. ఇక రాత్రికి కర్నూలులోనే బస చేసి, ఆదివారం ఉదయం మళ్లీ యాత్రలో పాల్గొంటారు. అనంతరం ఈ యాత్ర నంద్యాల జిల్లాలోకి ప్రవేశించనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories