విశాఖ జిల్లాలో దారుణం.. వివాహిత సజీవ దహనం

విశాఖ  జిల్లాలో దారుణం.. వివాహిత సజీవ దహనం
x
Highlights

విశాఖ జిల్లాలో వివాహిత అనుమానాస్పద స్థితిలో సజీవ దహనం అయింది. కనీసం ఆనవాళ్లు లేకుండా ఆమెను కాల్చి బూడిద చేశారు గుర్తుతెలియని వ్యక్తులు. ఈ ఘటన గాజువాక...

విశాఖ జిల్లాలో వివాహిత అనుమానాస్పద స్థితిలో సజీవ దహనం అయింది. కనీసం ఆనవాళ్లు లేకుండా ఆమెను కాల్చి బూడిద చేశారు గుర్తుతెలియని వ్యక్తులు. ఈ ఘటన గాజువాక మండలం రాజీవ్‌నగర్‌ దరి యాతపాలెంలో చోటుచేసుకుంది. మిందికి చెందిన తాటిశెట్టి శ్రీనివాసరావుకు కూర్మన్నపాలేనికి చెందిన సరోజినితో 2012లో వివాహం జరిగింది. వారికి ఇద్దరు సంతానం. శ్రీనివాసరావు విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నా డు. ప్రస్తుతం రాజీవ్‌నగర్‌ దరియాతపాలెంలో వీరు నివాసముంటున్నారు. శ్రీనివాసరావు ఎప్పటి మాదిరిగానే శనివారం జనరల్‌ షిఫ్ట్‌ విధులకు వెళ్లాడు. అయితే మధ్యాహ్నం తనపై ఎవరో దుప్పటి కప్పి గొంతు నులిమారంటూ సరోజిని తన భర్తకు ఫోన్‌ చేసి చెప్పింది. ఖంగారుపడిన భర్త శ్రీనివాసరావు వెంటనే ఇంటికి వచ్చాడు. అయితే ఇల్లంతా మంటలు వ్యాపిస్తున్నాయి.

ఆ మంటల్లో సరోజినీ సజీవదహనం అయింది. కనీసం ఆనవాళ్లు కూడా లేకుండా ఆమె కాలి బూడిద అయింది. శ్రీనివాసరావు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలికి చేరుకున్నారు పోలీసులు. చుట్టుపక్కల ప్రాంతాలు గమనించారు. ఎవరైనా బంగారం కోసం ఏ ఘాతుకానికి పాల్పడి ఉంటారా అని అనుమానిస్తున్నారు. ఇంట్లో ఉన్న బంగారం కనిపించకపోవడంతో మంటల్లో కరిగిపోయిందా లేక ఎవరైనా తీశారా అని ఆరాతీస్తున్నారు. వారి ఇంటివద్ద బైక్ కు పెట్రోల్ పైపు లాగి ఉండటంతో సరోజినీని పెట్రోల్ పోసి తగలబెట్టి ఉంటారని భావిస్తున్నారు. ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ సైతం భద్రంగా ఉండటంతో ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డాగ్‌ స్క్వాడ్‌ విచారణ కొనసాగించింది. క్లూస్‌ టీమ్‌ వేలిముద్రలను సేకరించింది. శ్రీనివాసరావు అతని బంధువులను విచారిస్తున్నారు. తల్లి మృతితో పిల్లలు తీవ్రంగా రోదిస్తున్నారు.

keywords : woman, burnt alive, rajivnagar ,dari yatapalem


Show Full Article
Print Article
More On
Next Story
More Stories