మహిళను దారుణంగా హత్య చేసిన దుండగులు

మహిళను దారుణంగా హత్య చేసిన దుండగులు
x
Highlights

విశాఖలో ఓ మహిళను దారుణంగా హత్య చేశారు దుండగులు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి ప్రాంతానికి చెందిన సాహుకారి

విశాఖలో ఓ మహిళను దారుణంగా హత్య చేశారు దుండగులు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి ప్రాంతానికి చెందిన సాహుకారి రమేష్‌కుమార్‌ మర్చంట్‌ నేవీలో కొన్నేళ్లుగా పని చేస్తున్నాడు. అతను భార్య సాహుకారి అలేఖ్య(30) వీరికి ఇద్దరు సంతానం. విశాఖ పశ్చిమ నియోజకవర్గం 48వ వార్డు ప్రియదర్శిని కాలనీలో నివాసముంటున్నారు.రమేష్‌కుమార్‌ మర్చంట్‌ నేవీ కావడంతో నెలల తరబడి షిప్‌లోనే విధులు నిర్వర్తిస్తుంటారు. ఈ క్రమంలో కుమారుడు, కుమార్తెతో అలేఖ్య ఇంటిలో ఉంటోంది. అయితే గురువారం ఉదయం 11 గంటల సమయంలో అలేఖ్య కుమారుడు తీవ్రంగా ఏడుస్తూ ఉన్నాడు. దాంతో ఎదురు ఇంట్లో ఉంటున్న ఓ వృద్ధురాలు అలేఖ్య ఇంటి తలుపు తట్టి... బాబు ఏడుస్తుంటే ఏం చేస్తున్నావని గట్టిగా అరిచింది.

అయితే ఎంత అరిచినా అలేఖ్య మాత్రం మాట్లాడలేదు. దీంతో అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా బాత్‌రూమ్‌ వద్ద అలేఖ్య విగతజీవిగా పడి ఉంది.. దాంతో షాక్‌కు గురైన వృద్ధురాలు.. ఇరుగుపొరుగు వారిని పిలిచింది. వారు వచ్చి అలేఖ్యను పరిశీలించగా ఆమె మెడపై తాడుతో బిగించిన ముద్ర ఉండటంతో మొదట మహిళా సంఘ ప్రతినిధికి సమాచారం అందించారు. ఆ వెంటనే పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అలేఖ్య ఇంటికి బుధవారం రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చాడని.. అయితే అతను అలేఖ్య బంధువా లేక ఇంకెవరైనా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories