ఆ భూమి కనిపెట్టినవారికి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా : ఆర్కే

ఆ భూమి కనిపెట్టినవారికి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా : ఆర్కే
x
Highlights

రాజధాని ప్రాంతంలో తన భార్య పేరిట 5 ఎకరాల భూమి వుందని టీడీపీ నాయకులు నిరూపించాలన్నారు మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే. ఆ భూమిని కనిపెట్టినవారికి...

రాజధాని ప్రాంతంలో తన భార్య పేరిట 5 ఎకరాల భూమి వుందని టీడీపీ నాయకులు నిరూపించాలన్నారు మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే. ఆ భూమిని కనిపెట్టినవారికి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని చెప్పారు. నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. లేదంటే పొరబాటుగా ఆరోపణలు చేసినట్లు టీడీపీ నాయకుడు బోండ ఉమ ఒప్పుకోవాలని ఆర్కే డిమాండ్ చేశారు.

రాజధాని పేరిట చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారని చంద్రబాబు అక్రమాలను బయటపెడతామన్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు వేల కోట్లు దోచుకున్నారని రాజధానికి చంద్రబాబు శాపం జగన్ వరం అని వ్యాఖ్యానించారు. ఐదేళ్లలో చంద్రబాబు ఒక్క శాశ్వత భవనం కూడా కట్టలేదని కనీసం రైతులకు ప్లాట్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories