పీటలదాకా వచ్చిన పెళ్లి అంతలోనే ఆగిపోయింది.. కారణం ఏంటంటే..

పీటలదాకా వచ్చిన పెళ్లి అంతలోనే ఆగిపోయింది.. కారణం ఏంటంటే..
x
Highlights

ఒక యువతితో నిశ్చితార్థం చేసుకుని.. మరొ యువతితో పెళ్లికి సిద్ధపడ్డాడో యువకుడు. అయితే ఆ పెళ్లి మధ్యలోనే ఆగిపోయింది. ఈ ఘటన కర్నూలు జిల్లా నంద్యాల లో...

ఒక యువతితో నిశ్చితార్థం చేసుకుని.. మరొ యువతితో పెళ్లికి సిద్ధపడ్డాడో యువకుడు. అయితే ఆ పెళ్లి మధ్యలోనే ఆగిపోయింది. ఈ ఘటన కర్నూలు జిల్లా నంద్యాల లో చోటుచేసుకుంది. నంద్యాలకు చెందిన మోహనకృష్ణ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే అతను ఇటీవల తిరుపతికి చెందిన ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దాంతో ఇరు కుటుంబాల పెద్దలు వారిద్దరికి నిశ్చితార్థం కూడా చేశారు. ఈ క్రమంలో కట్నకానుకలు కూడా మాట్లాడుకున్నారు.

ఇంతలో ఏమైందో ఏమో నంద్యాలలో మరొకరితో వివాహానికి సిద్ధపడ్డాడు మోహనకృష్ణ. ఈ విషయం తెలుసుకున్న తిరుపతికి చెందిన యువతి బంధువులు.. నంద్యాలకు చేరుకొని పెళ్లి తంతును అడ్డుకున్నారు, అక్కడే ఆందోళనకు దిగారు. దీంతో పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వరుడు మోహనకృష్ణతోపాటు ఆందోళనకు దిగిన వారిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌ కు తరలించారు. అధిక కట్నానికి ఆశపడే మోహనకృష్ణ ఇలా చేశాడని తిరుపతికి చెందిన యువతి బంధువులు ఆరోపిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories