అర్థరాత్రి దారుణం.. గ్యాస్‌ సిలిండర్‌ పేలి అన్నాచెల్లళ్ల మృతి

అర్థరాత్రి దారుణం.. గ్యాస్‌ సిలిండర్‌ పేలి అన్నాచెల్లళ్ల మృతి
x
Highlights

అర్థరాత్రి దారుణం.. గ్యాస్‌ సిలిండర్‌ పేలి అన్నాచెల్లళ్ల మృతి అర్థరాత్రి దారుణం.. గ్యాస్‌ సిలిండర్‌ పేలి అన్నాచెల్లళ్ల మృతి

విశాఖ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలి అన్నాచెల్లెళ్లు మృతిచెందగా.. తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన సాగర్ నగర్ హెచ్‌ఐజీలో జరిగింది. హెచ్‌ఐజీలో ఆర్టీసీ రీటైర్డ్ జేఈ చల్ల ఉమా మహేశ్వరరావు కుటుంబం నివాసం ఉంటోంది. ఉమా మహేశ్వరరావు భార్య మరణించింది. అప్పటి నుంచి ఆయన కుమారుడు, కుమార్తెలతో కలిసి ఉంటున్నాడు.. ఉమా మహేశ్వరరావు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాడు. అయితే గురువారం రాత్రి ఉమ మహేశ్వరరావు, కొడుకు, కుమార్తెతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్నారు. అయితే అర్ధ రాత్రి సమయంలో వారి ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలినట్టు స్థానికులు చెబుతున్నారు.

ఈ ఘటనలో కుమారుడు సతీష్ చంద్ర (38), కూతురు లావణ్య (32) తీవ్ర గాయపడి మృతి చెందారు. గాయాలతో ఉమా మహేశ్వరరావు ఆపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరిది ఆత్మహత్యే అంటున్నారు . ప్రమాదం జరిగిన ఇంట్లో పోలీసులు ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. మానసిక సమస్యల నేపథ్యంలోనే గ్యాస్‌ లీక్‌ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని వారు అనుమానిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories