'ఐ సపోర్ట్ వైజాగ్' : క్రికెటర్లు

ఐ సపోర్ట్ వైజాగ్ : క్రికెటర్లు
x
Highlights

విశాఖలో 'ఐ సపోర్ట్ వైజాగ్' నినాదాన్ని హైలైట్ చేస్తూ ప్రముఖులు 'స్వచ్ఛ్ సర్వేక్షన్ 2020' ప్రచారంలో బుధవారం పాల్గొన్నారు. డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి...

విశాఖలో 'ఐ సపోర్ట్ వైజాగ్' నినాదాన్ని హైలైట్ చేస్తూ ప్రముఖులు 'స్వచ్ఛ్ సర్వేక్షన్ 2020' ప్రచారంలో బుధవారం పాల్గొన్నారు. డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఎసిఎ-విడిసిఎ క్రికెట్ స్టేడియంలో జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్ సందర్భంగా జివిఎంసి అధికారులతో జతకట్టి 'స్వచ్ఛ్ సర్వేక్షన్ 2020' బ్రోచర్ ను ఆవిష్కరించారు. క్రికెట్ వ్యాఖ్యాతలు సునీల్ గవాస్కర్, సంజయ్ మంజ్రేకర్, వివిఎస్ లక్ష్మణ్, హర్ష భోగ్లే స్టేడియంలో జరిగిన ఈ ప్రచార కార్యక్రమానికి మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా క్రికెటర్లు వేణుగోపాల్ రావు, షాబుద్దీన్, పోలీసులు, రాజకీయ నాయకులు, బిజెపి నాయకుడు పి విష్ణు కుమార్ రాజు, జివిఎంసి అదనపు కమిషనర్ వి సన్యాసి రావు, క్రికెట్ ఔత్సాహికులు పలువురు ఈ సందర్భంగా జరిగిన 'స్వచ్ఛ సర్వేక్షన్ 2020' ప్రచారంలో పాల్గొన్నారు. ప్రముఖులతో కూడిన ఈ ప్రయత్నం ప్రజలలో స్వచ్ఛ సర్వేక్షన్ గురించి అవగాహన కల్పించడమే లక్ష్యమని జివిఎంసి కమిషనర్ జి. శ్రీజన అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories