గ్రామ సచివాలయ ఉద్యోగిని ఆత్మహత్య

గ్రామ సచివాలయ ఉద్యోగిని ఆత్మహత్య
x
Highlights

గ్రామ సచివాలయ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. కనేకల్ పంచాయతీలో గ్రామ సచివాలయ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న...

గ్రామ సచివాలయ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. కనేకల్ పంచాయతీలో గ్రామ సచివాలయ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న నందిని (22) అనే యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా నందిని ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. నందిని గత ఏడాది జరిగిన గ్రామ సచివాలయ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి. గ్రామ కార్యదర్శి పోస్టుకు ఎంపికైంది. అయితే ఇంతలోనే ఆమె ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories