విజయవాడ టీడీపీ మేయర్ అభ్యర్థి ఫైనల్.. ఆమె ఎవరో తెలుసా?

విజయవాడ టీడీపీ మేయర్ అభ్యర్థి ఫైనల్.. ఆమె ఎవరో తెలుసా?
x
Highlights

విజయవాడ కార్పొరేషన్ టీడీపీ మేయర్ అభ్యర్థిని టీడీపీ అధిష్టానం ఫైనల్ చేసింది. ఆ పార్టీ అభ్యర్థిగా ఎంపీ కేశినేని నాని రెండో కుమార్తె శ్వేతాను ఎంపిక...

విజయవాడ కార్పొరేషన్ టీడీపీ మేయర్ అభ్యర్థిని టీడీపీ అధిష్టానం ఫైనల్ చేసింది. ఆ పార్టీ అభ్యర్థిగా ఎంపీ కేశినేని నాని రెండో కుమార్తె శ్వేతాను ఎంపిక చేసింది. గత రెండు పార్లమెంటు ఎన్నికల్లో తండ్రి తరుపున శ్వేతా ప్రచారం నిర్వహించారు. యూఎస్ లో జరిగిన గత ఎన్నికల్లో ఆమె హిల్లరీ క్లింటన్ తరుపున ప్రచారం నిర్వహించారని టీడీపీ నేతలు చెబుతుంటారు. కాగా రాజధాని పరిధిలో ఉన్న ఈ సీటుకోసం అధికార ప్రతిపక్షాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.

వైసీపీ తరుపున మేయర్ అభ్యర్థిగా బొప్పన భవకుమార్ సతీమణిని ఆ పార్టీ ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతోంది. భవకుమార్ గత ఎన్నికల్లో విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేశారు. విజయవాడలో ఇప్పటికే టీడీపీ వైసీపీలు ప్రచారం ప్రారంభించాయి. వైసీపీ అభ్యర్థుల గెలుపుకోసం ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు రంగంలోకి దిగారు. అలాగే టీడీపీ నుంచి కేశినేని నాని, బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా, వంగవీటి రాధా ప్రచార బాధ్యతలను మోస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories