*ఎంపీ కనకమేడలపై రాజ్యసభ ఛైర్మన్కు విజయసాయిరెడ్డి ఫిర్యాదు *కనకమేడల వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించకపోవడం దురదృష్టకరం
ఎంపీ కనకమేడలపై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్మనాయుడుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో ఎంపీ కనకమేడల సభా నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడారన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. కనకమేడల వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ నేపథ్యంలో కనకమేడలపై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యకు ఎంపీ విజయసాయిరెడ్డి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల చేసిన ఆరోపణలను రికార్డుల నుంచి తొలగించాలంటూ విజయసాయిరెడ్డి పాయింట్ ఆఫ్ ఆర్డర్ను లేవనెత్తారు. అయితే విజయసాయి లేవనెత్తిన పాయింట్ ఆఫ్ ఆర్డర్ను వెంకయ్యనాయుడు తోసిపుచ్చారు. దీనికి నిరసనగా వైసీపీ ఎంపీలు వెల్లోకి వచ్చారు. విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని వివిధ పార్టీలకు చెందిన రాజ్యసభ సభ్యులు కోరారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire