భూములు కొట్టేసిన ఎలుకలన్నీ బయటకొస్తున్నాయి : విజయసాయిరెడ్డి

భూములు కొట్టేసిన ఎలుకలన్నీ బయటకొస్తున్నాయి : విజయసాయిరెడ్డి
x
Highlights

విక్రమార్కుడు-భేతాళ కథల్లోని భేతాళుడితో పోల్చదగ్గ వ్యక్తి చంద్రబాబు అని అన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. చంద్రబాబు రకరకాల మ్యానిప్యులేషన్లతో...

విక్రమార్కుడు-భేతాళ కథల్లోని భేతాళుడితో పోల్చదగ్గ వ్యక్తి చంద్రబాబు అని అన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. చంద్రబాబు రకరకాల మ్యానిప్యులేషన్లతో తప్పించుకుంటూ వస్తున్నాడని ఎద్దేవా చేశారు. చేసిన తప్పుల నుంచి శాశ్వతంగా ఎవరూ బయట పడలేరని త్వరలోనే ఆయనకు అర్థమవుతుందని పేర్కొన్నారు. చంద్రబాబులాంటి వ్యక్తులు కుతంత్రాలతో ప్రజలను రెచ్చగొట్టి తను రక్షణ పొందాలని చూస్తుంటాడని అన్నారు. ఇన్ సైడర్ ట్రేడింగులో భూములు చౌకగా కొట్టేసిన ఎలుకలన్నీ కలుగుల్లో నుంచి బయటి కొస్తున్నాయని అన్నారు. అయితే తప్పు చేసి కూడా పరువు నష్టం దావా వేస్తామని, దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండని సవాళ్లు విసురుతున్నారని ఎద్దేవా చేశారు.

అలా సవాళ్లు చేసే బదులు సిఐడి లేదా సిబిఐతో దర్యాప్తు జరిపించమని లేఖలు రాయాలని అప్పుడు మీరు నిప్పులో తుప్పులో తేలుతుంది అంటూ వ్యాఖ్యానించారు. సీఎం నివాసంపై విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలు.. జగన్ గారి నివాసం తమరి హయాంలోనే పూర్తయిందని.. అనుమతి లేకపోతే అప్పుడు నోళ్లెందుకు పెగల్లేదని అన్నారు. జగన్ గారి నివాసం లింగమనేని గెస్ట్ హౌజులా నదిని పూడ్చి కట్టింది కాదు.. తోక కనిపించకున్నా అదిగో పులి అనే బ్యాచ్ తయారైంది అని టీడీపీ నేతలపై మండిపడ్డారు విజయసాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories