నూజివీడు ట్రిపుల్ ఐటీలో విజిలెన్స్ దాడులు

admin1
Published on: 20 Nov 2019 6:06 PM IST
నూజివీడు ట్రిపుల్ ఐటీలో విజిలెన్స్ దాడులు
X

కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో విజిలెన్స్ దాడులు నిర్వహిస్తోంది. నాలుగు రోజులుగా రహస్య తనిఖీలు చేస్తోంది. ల్యాప్ టాప్‌ల కొనుగోలు బాగోతంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ల్యాప్ టాప్‌ల కొనుగోళ్లలో కోట్ల రూపాయల మేర అవినీతి జరిగినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు.

గత ప్రభుత్వ పాలనలో వైస్ చాన్సలర్, వీసీ ఆఫీసులో పని చేసిన అధికారులు, ట్రిపుల్ ఐటీ క్యాంపస్ డైరెక్టర్ల పనితీరును పరిశీలిస్తున్నారు. క్యాంపస్‌లో కాంట్రాక్టు అధ్యాపకుల నియామకాల్లో జరిగిన అవినీతిపై ఆరా తీస్తున్నారు.



admin1

admin1

Next Story