వేదాద్రి ప్రమాదం: మృతులకు రూ.5లక్షలు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశం‌

వేదాద్రి ప్రమాదం: మృతులకు రూ.5లక్షలు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశం‌
x
Highlights

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీంలోని వేదాద్రి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారికి ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సీఎం జగన్...

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీంలోని వేదాద్రి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారికి ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రమాదానికిగురై ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ వారికీ ఎక్స్‌గ్రేషియా వర్తింపుచేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఏపీ భూభాగంలోనే ప్రమాదం జరిగినందున మానవతా దృక్పథంతో మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కాగా తెలంగాణ ప్రభుత్వం రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు 2లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన విషయం తెలిసిందే.

కాగా కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. పలువురు ఈ ఘటనలో గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు ఖమ్మం జిల్లా మధిర వాసులుగా గుర్తించారు. వీరంతా వేదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి వచ్చారు. ఆలయం సమీపంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 30 మందికిపైగా ప్రయాణిస్తున్నట్లు సమాచారం. డ్రైవర్‌ మద్యం మత్తులో లారీని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories