తాజా మాజీ టీడీపీ నేత ఆస్తుల జప్తుకు నోటీసులు

తాజా మాజీ టీడీపీ నేత ఆస్తుల జప్తుకు నోటీసులు
x
Highlights

తాజా మాజీ టీడీపీ నేత ఆస్తుల జప్తుకు నోటీసులు తాజా మాజీ టీడీపీ నేత ఆస్తుల జప్తుకు నోటీసులు

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాజీ టీడీపీ నేత, డీసీసీబీ చైర్మన్‌ వరుపుల రాజాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ఆస్తుల జప్తునకు రిజస్టర్‌ ఆఫ్‌ కోపరేటివ్‌ సోసైటీ నోటీసులు జారీ చేసింది. దీంతో వరుపుల రాజా నివాసానికి అధికారులు జప్తు నోటీసులు అంటించారు. ప్రత్తిపాడు మండలం లంపకలోప వ్యవసాయ సహకార పరపతి సంఘంలో రూ. 18,96,38,222 అవినీతి జరిగిందని.. చనిపోయిన వ్యక్తులు, బినామీ పేర్ల మీద లోన్లు మంజూరు చేసి నిధులు కాజేశారని రాజాతోపాటు 12 మంది డైరెక్టర్లు, సోసైటీ సీఈవో వెంకటరావుపై ఆరోపణలు వచ్చాయి.

వీటిపై విచారణ జరిపించాలని వైసీపీ ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్‌ ఫిర్యాదు చేశారు. దాంతో అధికారులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే ఆయన ఆస్తుల జప్తునకు నోటీసులు అంటించినట్టు తెలుస్తోంది. కాగా, గత సాధారణ ఎన్నికల్లో పత్తిపాడు అసెంబ్లీకి పోటీ చేసిన రాజా.. వైసీపీ అభ్యర్థి పర్వత పూర్ణచంద్ర ప్రసాద్‌ పై ఓటమిపాలయ్యారు. అనంతరం రాజా టీడీపీకి గుడ్‌ బై చెప్పారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories