నేను టీడీపీతో ఉండలేను: వల్లభనేని వంశీ

నేను టీడీపీతో ఉండలేను: వల్లభనేని వంశీ
x
ఎమ్మెల్యే వల్లభనేని వంశీ
Highlights

అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రెండో రోజు సందర్బంగా సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు.

అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రెండో రోజు సందర్బంగా సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. సభలో తాను మాట్లాడుతుగా టీడీపీ సభ్యులు అడ్డుపడుతున్నారని స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేగా కొనసాగేందుకు వంశీ అనర్హుడని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే చంద్రబాబు వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వంశీ స్పందించారు. తనకు మాట్లాడే హక్కు ఎందుకు లేదని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసినంత మాత్రాన తనను సస్పెండ్‌ చేస్తారా? తాను టీడీపీ సభ్యుడునే అని అంటూ మాట్లాడే హక్కు తనకు లేదా.. అయితే నేను టీడీపీతో ఉండలేను అంటూ టీడీపీపై విరుచుకుపడ్డారు. వంశీ మాట్లాడుతూ.. ఇళ్ల పట్టాల గురించి సీఎం జగన్‌ను కలిశానని.. తన నియోజకవర్గ సమస్యలు సీఎంకు చెప్పుకున్నానన్నారు.

మానవతా దృక్పథంతో సీఎం సానుకూలంగా స్పందించారని.. అయితే ఆ తరువాత తనపై చంద్రబాబు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయించారని అన్నారు. రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టే నిర్ణయాన్ని స్వాగతించాను అని అన్నారు. అంతేకాకుండా గతంలో తాను చాలా సార్లు సీఎం జగన్ ను కలిశానని చెప్పారు. పోలవరం కుడి కాలువ విషయంలో సీఎంతో చర్చించానని అన్నారు.

అంతమాత్రాన తనను పార్టీనుంచి సస్పెండ్ చేస్తారా అని ప్రశ్నించారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ వలన చాలామంది జీవితాలు బాగుపడ్డాయని అన్నారు. కాగా వంశీ మాట్లాడుతుండగా టీడీపీ సభ్యులు అడ్డుకోవడాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్రంగా తప్పుబట్టారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories