
V Vijayasai Reddy: పురందేశ్వరీ టార్గెట్గా మరోసారి వైసీపీ ఎంపీ హాట్ కామెంట్స్
V Vijayasai Reddy: కొన్ని రోజులుగా బీజేపీ చీఫ్, వైసీపీ ఎంపీ మధ్య పరస్పర ఆరోపణలు
V Vijayasai Reddy: ఏపీలో విజయసాయి రెడ్డి వర్సెస్ పురంధేశ్వరీ అన్నట్టుగా ఉంది పరిస్థితి. గత కొన్ని రోజులుగా పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. పురంధేశ్వరి టార్గెట్గా మరోసారి వైసీపీ ఎంపీ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్కు మద్దతుగా టీడీపీ పోటీ చేయొద్దని.. సలహా ఇచ్చింది మీరేనంట కదా అంటూ బీజేపీ చీఫ్పై విమర్శలు చేశారు. తెలంగాణలో ఉన్న ఆస్తులు, నివాసాలు కాపాడుకునే ప్రయత్నమంటూ వైసీపీ ఎంపీ ట్వీట్ చేయడం కలకలం రేపుతోంది. కాంగ్రెస్ గెలిస్తే మీరు అధికారంలో ఉన్నటే అనుకుంటున్నారట, ఎన్ని విన్యాసాలు చేస్తారమ్మా, బీజేపీ గురించి కాక సామాజికవర్గ ప్రయోజనాల కోసం..ఆరాటపడుతున్నారు అంటూ పురంధేశ్వరిపై విజయసాయి విమర్శలు చేశారు. మరి దీనికి పురంధేశ్వరి రిప్లై ఎలా ఉంటుందో చూడాలి.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్ధతుగా టీడీపీ పోటీ చేయొద్దని సలహా ఇచ్చింది మీరేనంట కదా పురందేశ్వరి గారూ. మీ అందరి ఆస్తులు, నివాసాలు ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపించుకుంటే మీరు అధికారంలో ఉన్నట్టే అని అనుకుంటున్నారట. ఎన్ని విన్యాసాలు చేస్తారమ్మా! బిజెపి గురించి కాక సామాజికవర్గ…
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 15, 2023

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




