మృగంలా మారిన బాబాయ్.. భవనం మీదనుంచి చిన్నారిని తోసేశాడు..

మృగంలా మారిన బాబాయ్.. భవనం మీదనుంచి చిన్నారిని తోసేశాడు..
x
Highlights

కృష్ణా జిల్లా విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. సొంత అన్నకూతురినే భవనం మూడో అంతస్తు నుంచి కిందకు పడేశాడో దుర్మార్గుడు.. ఈ ఘటన వాంబే కాలనీలో...

కృష్ణా జిల్లా విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. సొంత అన్నకూతురినే భవనం మూడో అంతస్తు నుంచి కిందకు పడేశాడో దుర్మార్గుడు.. ఈ ఘటన వాంబే కాలనీలో చోటుచేసుకుంది. వాంబేకాలనీ సీ బ్లాకుకు చెందిన కొండ్రాజు శ్రీదేవి, యేసురాజు దంపతులకు ముగ్గురు పిల్లలు. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ప్రార్థన పెట్టుకునేందుకు శ్రీదేవి ఇల్లు శుభ్రం చేసి బయటకు వెళ్లింది.

ఇంతలో ఆమె మరిది కృష్ణ(28) మద్యం తాగొచ్చి మత్తులో ఇంట్లో ఉన్న అన్నాన్ని పడేశాడు. ఇదేం పనని వదిన మందలించగా.. మద్యం మత్తులో ఉన్న కృష్ణ ఆమెపైనా బూతు పురాణం అందుకున్నాడు. ఇష్టం వచ్చినట్టు చెప్పలేని పదాలతో ఆమెను దూషించాడు. ఇంతలో ఇంటికి చేరుకున్న యేసురాజు తమ్ముడిపై గొడవకు దిగడంతో.. యేసురాజు ఆరేళ్ళ కూతురిని మూడో అంతస్థు మీదకు తీసుకెళ్లి కిందకు పడేశాడు. దాంతో చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లాడు యేసురాజు. ప్రస్తుతం గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories