శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. లడ్డు విక్రయం .. ఫోన్ నంబర్లు ఇవే

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. లడ్డు విక్రయం .. ఫోన్ నంబర్లు ఇవే
x
Highlights

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)శ్రీవారి భక్తులకు శుభవార్త అందించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)శ్రీవారి భక్తులకు శుభవార్త అందించారు.భక్తులకు స్వామివారి ఆశీస్సులు అందించాలన్న ఉద్దేశంతో లడ్డూ ప్రసాదాలు విక్రయించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ ఒక్కో లడ్డూ రూ.25కే అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనాన్ని గత 60 రోజులుగా కల్పించలేకపోవడం బాధాకరమని తిరుమల చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

స్వామివారి దర్శనాలు ఎప్పుడు పునఃప్రారంభిస్తామో ఇప్పట్లో చెప్పలేమని స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ సమాచార కేంద్రాలు, టీటీడీ కల్యాణ మండపాల్లో లడ్డూ విక్రయాలు చేపట్టనున్నట్లు సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.ప్రత్యేక ఆర్డర్‌పై స్వామివారి లడ్డూలు పంపిణీ చేయనున్నామని.. పెద్దమొత్తంలో లడ్డూ ప్రసాదం కావాలనుకునేవారు ప్రత్యేక ఆర్డర్‌ చేసుకోవచ్చని సూచించారు. పూర్తి వివరాల కోసం ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌ - 98495 75952, ఆలయ పేష్కార్‌ శ్రీనివాస్‌ - 9701092777ను సంప్రదించవచ్చని టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి తెలిపారు. తమిళనాడు, కర్ణాటకలో కూడా లడ్డూ ప్రసాదం విక్రయిస్తామన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories