టీటీడీ కీలక నిర్ణయం..

టీటీడీ కీలక నిర్ణయం..
x
Tirupati
Highlights

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కోవిడ్ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో నివారణ చర్యల్లో భాగంగా భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించ కూడదని టీటీడీ నిర్ణయించింది.

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కోవిడ్ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో నివారణ చర్యల్లో భాగంగా భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించ కూడదని టీటీడీ నిర్ణయించింది. ఏప్రిల్‌ 14 వరకు శ్రీవారికి కేవలం నిత్య కైంకర్యాలను మాత్రమే నిర్వహిస్తామని టిటిడి తెలిపింది.

మరోవైపు టీటీడీ సిబ్బంది వారం రోజుల పాటు తిరుమలలో షిఫ్ట్‌ పద్ధతిలో విధులు నిర్వహించనున్నారు. రెండు రహదారులను దేవస్థానం అధికారులు మూసివేశారు. దేవస్థానం తరపున తిరుపతిలో 50 వేల మందికి ఆహారం పంపిణీ చేస్తున్నారు. ఏప్రిల్‌ 2న గురువారం శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించాల్సిన శ్రీవారి హనుమంత సేవను కూడా రద్దు చేసింది. స్వామివారి వార్షిక వసంతోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో టీటీడీ సామాజిక సేవలో భాగమైంది. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో తిండిలేక అవస్థలు పడుతున్న వారి ఆకలి తీర్చేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు రోజుకు రెండు పూటలా వివిధ ఆహార పదార్థాలను తిరుపతి నగరంలోని కాలనీల్లో పంపిణీ చేస్తోంది. మధ్యాహ్నం 35వేలు, రాత్రి సమయంలో 15వేల మందికి అన్నం పొట్లాలను అందిస్తోంది. పులిహోర, పెరుగన్నం, సాంబారన్నం, టమాటో రైస్‌, గోధుమరవ్వ ఉప్మాను పేదలకు ఉచితంగా అందజేస్తోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories