నేడు టీటీడీ బోర్డు తొలి సమావేశం.. చర్చించే అంశాలు ఇవే..

నేడు టీటీడీ బోర్డు తొలి సమావేశం.. చర్చించే అంశాలు ఇవే..
x
Highlights

నేడు టీటీడీ బోర్డు తొలి సమావేశం.. చర్చించే అంశాలు ఇవే.. నేడు టీటీడీ బోర్డు తొలి సమావేశం.. చర్చించే అంశాలు ఇవే..

తిరుమల అన్నమయ్య భవన్‌లో నేడు టీటీడీ బోర్డు తొలి సమావేశం జరగనుంది. ముందుగా ఇటీవల నియమితులైన బోర్డు సభ్యులు ప్రమాణస్వీకారం చేస్తారు. అనంతరం సభ్యులందరు సమావేశం అవుతారు. ఈ సమావేశంలో ప్రధానంగా శ్రీవారి ప్రసాదం ముడిసరుకుల కొనుగోలు అలాగే కీలకమైన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై పాలకమండలి చర్చించనుంది. రూ.79 కోట్లతో తిరుమలలో యాత్రికుల వసతి సముదాయం-5 నిర్మాణం, అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణ నిధుల కుదింపుపైనా, తిరుపతిలో గరుడ వారధికి రూ.100 కోట్లు కేటాయింపునకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. శ్రీవాణి ట్రస్ట్‌ ద్వారా వీఐపీ బ్రేక్ దర్శనాలపైనా చర్చించనుంది. అలాగే రూ.100 కోట్లతో తిరుపతిలో హాస్టల్ నిర్మాణానికి ఆమోదం తెలపనుంది బోర్డు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories