నేడు వైసీపీ ఎంపీల కీలక మీటింగ్

నేడు వైసీపీ ఎంపీల కీలక మీటింగ్
x
Highlights

త్వరలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు వైసీపీ సన్నద్ధమవుతోంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన...

త్వరలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు వైసీపీ సన్నద్ధమవుతోంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వైసీపీ ఎంపీలు శుక్రవారం భేటీ అవ్వనున్నారు. ప్రధానంగా ఏపీకి ప్రత్యేక హోదా, పెండింగ్ నిధులు, పోర్టు నిర్మాణం వంటి కీలక అంశాలపై ఎంపీలు చర్చించనున్నారు. వాస్తవానికి ఈ సమావేశం గరువారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరగాల్సి ఉన్నా.. ప్రభుత్వం చేపట్టిన 'నాడు-నేడు' కార్యక్రమం నేపథ్యంలో శుక్రవారానికి వాయిదా వేశారు. కాగా సభ్యులంతా పార్లమెంటుకు తప్పనిసరిగా హాజరుకావాలని, ప్రత్యేక హోదా గురించి లోక్‌సభలో అడుగుతూనే ఉండాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలోనే సూచించారు. మీడియా ముందు మాట్లాడేటప్పుడు సంయమనం కోల్పోరాదని ఎంపీలకు హితోపదేశం చేశారు జగన్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories