వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమంటే... మేము సై.. : మాజీ ఎంపీ చింతా మోహన్

వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమంటే... మేము సై.. : మాజీ ఎంపీ చింతా మోహన్
x
Highlights

కాంగ్రెస్ సీనియర్ నేత, తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి...

కాంగ్రెస్ సీనియర్ నేత, తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సిద్ధమంటే... ఆయన పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని తిరుపతిలో వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సీఎం పదవి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని తెలిపారు. పవన్ కళ్యాణ్ ముందుకొస్తే జనసేనతో పొత్తుకు కూడా తాము సిద్ధంగానే ఉన్నామని అన్నారు. పవన్ కళ్యాణ్ తమ పార్టీ నాయకుడు చిరంజీవి తమ్ముడే కదా అని చింతా మోహన్ తెలిపారు. అయితే ఇది తన వ్యక్తిగత ఆలోచన మాత్రమే అని... దీనిపై కాంగ్రెస్ హైకమాండ్‌తో చర్చిస్తానని ఆయన చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories