Tirumala Darshan: తిరుమల శ్రీవారిని దర్శించిన ప్రముఖులు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు శీవారి సేవలో కేంద్రమంత్రులు, నిర్మల సీతారామన్, సత్యపాల్ సింగ్.. మంత్రి లాల్ చౌదరి ,మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ దర్శనం దర్శనాంతరం తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ అర్చకులు..

Ramya Vegirouthu
Published on: 12 Sept 2025 2:17 PM IST
Tirumala Darshan: తిరుమల శ్రీవారిని దర్శించిన ప్రముఖులు
X

Tirumala Darshan: తిరుమల శ్రీవారిని దర్శించిన ప్రముఖులు

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం అభిషేక సేవలో కేంద్రమంత్రి నిర్మల సీతారామన్, రాజస్థాన్ మంత్రి కాంహయ్య లాల్ చౌదరి, కేంద్రమంత్రి సత్యపాల్ సింగ్ బాగాల్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద అర్చకులు వేద ఆశీర్వచనం చేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసారు.

Ramya Vegirouthu

Ramya Vegirouthu

Next Story