వడ్డీ వ్యాపారి బెదిరింపులు...ముగ్గురు విద్యార్థినులు ఆత్మహత్యాయత్నం !

వడ్డీ వ్యాపారి బెదిరింపులు...ముగ్గురు విద్యార్థినులు ఆత్మహత్యాయత్నం !
x
వడ్డీ వ్యాపారి బెదిరింపులు...ముగ్గురు విద్యార్థినులు ఆత్మహత్యాయత్నం !
Highlights

అనంతపురంలో విషాద ఘటన చోటు చేసుకుంది. వడ్డీ వ్యాపారి బెదిరింపులతో ముగ్గురు విద్యార్థినులు ఆత్మహత్యకు యత్నించారు. ధర్మరానికి చెందిన ముగ్గురు అమ్మాయిలకు...

అనంతపురంలో విషాద ఘటన చోటు చేసుకుంది. వడ్డీ వ్యాపారి బెదిరింపులతో ముగ్గురు విద్యార్థినులు ఆత్మహత్యకు యత్నించారు. ధర్మరానికి చెందిన ముగ్గురు అమ్మాయిలకు మహేష్ అనే యువకుడితో ఫేస్‌ బుక్ ఫ్రెండ్‌షిప్ ఉంది. అతడితో చాటింగ్ చేస్తుండే వారు. అతడి నుంచి అప్పు కింద 20వేల రూపాయలు తీసుకున్నారు. ఈ విషయంలో వారి కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. దీంతో వారి మధ్య ఫ్రెండ్‌షిప్ కట్ అయింది.

తాజాగా ఆ యువకుడు, అమ్మాయిలతో డబ్బు చెల్లించే విషయంలో వాగ్వాదం జరిగింది. దీంతో మనస్థాపం చెందిన ముగ్గురు అమ్మాయిలు నిద్రమాత్రలు మింగి అనంతపురం బస్టాండ్‌లో అపస్మారక స్థితిలో ఉన్నారు. పోలీసులు వీరిని గుర్తించి ఆసుపత్రికి తరలించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories