మతిస్థిమితం లేని మహిళపై ముగ్గురు యువకుల అత్యాచారం

మతిస్థిమితం లేని మహిళపై ముగ్గురు యువకుల అత్యాచారం
x
Highlights

మతిస్థిమితం లేని మహిళపై ముగ్గురు యువకుల అత్యాచారం

మతిస్థిమితం లేని ఓ మహిళపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా కణేకల్లు మండలానికి చెందిన ఓ మహిళకు మతిస్థిమితం లేదు. కొన్నేళ్ల క్రితం ఆమె తల్లిదండ్రులు మరణించారు. అయితే స్థానికులు ఓ వ్యక్తితో వివాహం జరిపించగా మతిస్థిమితం లేని మహిళ కావడంతో ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు భర్త. దీంతో అప్పటి నుంచి గ్రామంలోని ఓ ఇంట్లో పాచి పని చేస్తూ జీవనం సాగిస్తోంది.

ఆ మహిళపై కన్నేసిన ముగ్గురు యువకులు ఆమెపై నెలల తరబడి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఆమె శరీరంలో మార్పులను గమనించిన స్థానికులు ఆరాతీయగా అత్యాచారం విషయం బయటపడింది. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భిణీ. ఆ ముగ్గురు యువకుల గురించి తెలియడంతో పెద్దమనుషులు పంచాయితీ పెట్టి డబ్బు ముట్టజెప్పించాలనుకున్నారు.. అబార్షన్ చెయించాలని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించడంతో ప్రమాదమని వైద్యులు చెప్పడంతో ఆమెను అంగనవాడి కేంద్రంలో ఉంచి పౌష్టికాహారం అందిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories