
ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు జరపనున్నట్టు విద్యాశాఖ తెలిపింది. ఈ మేరకు మంగళవారం వెలగపూడిలోని తాత్కాలిక...
ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు జరపనున్నట్టు విద్యాశాఖ తెలిపింది. ఈ మేరకు మంగళవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మంత్రులు ఆదిమూలపు సురేశ్, అనిల్కుమార్ యాదవ్ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేశారు. వచ్చే ఏడాది మార్చి 23 నుంచి మొదలై ఏప్రిల్ 8 వరకు జరుగుతాయని.. పరీక్ష ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 కు ముగుస్తుందని మంత్రులు తెలిపారు. పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈ నెల 20 వరకు అవకాశం ఉందని తెలిపారు. రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబరు 27 వరకు, రూ.200 రుసుముతో జనవరి 4 వరకు, రూ.500 రుసుముతో జనవరి 18 వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు.
పరీక్షల షెడ్యూల్
23/03/20 ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1(గ్రూప్-ఏ)
ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1(కాంపోజిట్)
24/03/20 ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2(గ్రూప్-ఏ)
ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2(కాంపోజిట్)
ఓఎస్ఎస్సీ లాంగ్వేజ్ పేపర్-1
(సంస్కృతం, అరబిక్, పర్షియన్)
26/03/20 సెకండ్ లాంగ్వేజ్
27/03/20 ఇంగ్లీషు పేపర్-1
28/03/20 ఇంగ్లీషు పేపర్-2
30/03/20 మేథ్స్ పేపర్-1
31/03/20 మేథ్స్ పేపర్-2
01/04/20 జనరల్ సైన్స్ పేపర్-1
03/04/20 జనరల్ సైన్స్ పేపర్-2
04/04/20 సోషల్ స్టడీస్ పేపర్-1
06/04/20 సోషల్ స్టడీస్ పేపర్-2
07/04/20 ఓఎస్ఎస్సీ లాంగ్వేజ్ పేపర్-2
(సంస్కృతం, అరబిక్, పర్షియన్)
08/04/20 ఎస్ఎస్సీ వొకేషనల్ కోర్స్(థియరీ)

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire