Janasena: ఏపీ మహిళ కమిషన్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. జనసేన వీరమహిళల మధ్య తోపులాట

Janasena: వాసిరెడ్డి పద్మను చైర్మన్‌ పదవి నుంచి తొలగించాలంటూ నినాదాలు

Shekhar G
Published on: 31 July 2023 2:32 PM IST
Tension At AP Women Commission Office
X

Janasena: ఏపీ మహిళ కమిషన్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. జనసేన వీరమహిళల మధ్య తోపులాట

Janasena: ఏపీ మహిళ కమిషన్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. వాసిరెడ్డి పద్మను కలిసేందుకు వచ్చిన జనసేన వీరమహిళలు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, జనసేన వీరమహిళలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు. పవన్‌పై చేసిన వ్యాఖ్యలపై వాసిరెడ్డి పద్మ చర్చకు రావాలంటూ జనసేన వీరమహిళలు సవాల్ విసిరారు. వాసిరెడ్డి పద్మను చైర్మన్‌ పదవి నుంచి తొలగించాలంటూ నినాదాలు చేశారు.

Shekhar G

Shekhar G

Next Story