టీడీపీ ఎమ్మెల్సీకి గ్రామస్తుల షాక్.. ఆ ఎమ్మెల్సీతో మాట్లాడితే రూ.10వేల జరిమాన !

టీడీపీ ఎమ్మెల్సీకి గ్రామస్తుల షాక్.. ఆ ఎమ్మెల్సీతో మాట్లాడితే రూ.10వేల జరిమాన !
x
Highlights

టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్రకు నెల్లూరు జిల్లా ఇస్కపల్లి గ్రామస్తులు భారీ షాక్ ఇచ్చారు. ఈ ఊరంత దరిద్రం మరో ఊరు లేదంటూ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర...

టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్రకు నెల్లూరు జిల్లా ఇస్కపల్లి గ్రామస్తులు భారీ షాక్ ఇచ్చారు. ఈ ఊరంత దరిద్రం మరో ఊరు లేదంటూ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ వ్యాఖ్యలపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ రవిచంద్రతో ఎవరూ మాట్లాడవద్దని తీర్మానించారు. ఆయనతో మాట్లాడితే 10వేలు జరిమానా చెల్లించాలని కట్టుబాటు పెట్టారు. అయితే ఈ అంశంపై టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర స్పందించారు.

గ్రామంలో జరిగిన వాస్తవ పరిస్థితి వేరు అని బయట ప్రచారంలో ఉన్నది వేరు అని ఆయన వ్యాఖ్యానించారు. తాను గ్రామాన్ని అలా అనలేదని కేవలం గ్రామంలో అపరిశుభ్రత పరిస్థితులపైనే మాట్లాడానని వివరించారు. తాను చేసిన వ్యాఖ్యలు గ్రామం గురించి కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో మాట్లాడుతానని బీద రవిచంద్ర అన్నారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories