కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ నేత దారుణ హత్య
* నందం సుబ్బయ్యను కత్తులతో నరికి చంపిన ప్రత్యర్థులు * పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే స్థలంలో సుబ్బయ్య మృతదేహం * గత కొంతకాలంగా వైసీపీ నేతలపై ఆరోపణలు చేస్తున్న సుబ్బయ్య
reprasentational image
కడప జిల్లాలో మరో రాజకీయ హత్య జరిగింది. ప్రొద్దుటూరులో టీడీపీ నేత, న్యాయవాది నందం సుబ్బయ్య దారుణ హత్యకు గురయ్యాడు. సుబ్బయ్యను కత్తులతో అతి దారుణంగా నరికి చంపారు ప్రత్యర్థులు. హత్యానంతరం మృతదేహాన్ని పేదలకు ఇళ్ల పట్టాలు అందించే స్థలంలో పడేశారు. గత కొంతకాలంగా సుబ్బయ్య వైసీపీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story




