ఏపీలో పొలిటికల్ హీట్.. మార్చి 3న గుంటూరులో మంత్రి తలసాని ఆధ్వర్యంలో..

ఏపీలో పొలిటికల్ హీట్.. మార్చి 3న గుంటూరులో మంత్రి తలసాని ఆధ్వర్యంలో..
x
Highlights

ఏపీలో కొంతకాలంగా వరుస పర్యటనలతో రాజకీయ హీట్ పెంచుతున్న మంత్రి తలసాని మరోసారి ఏపీలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్బంగా...

ఏపీలో కొంతకాలంగా వరుస పర్యటనలతో రాజకీయ హీట్ పెంచుతున్న మంత్రి తలసాని మరోసారి ఏపీలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్బంగా మాట్లాడిన ఆయన.. ఈ బడ్జెట్ తో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందని అన్నారు. ఏపీ ప్రజలతో తనకు 30 ఏళ్లకు పైగా అనుబంధం ఉందని, సీఎం కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదేశిస్తే ఆ రాష్ట్ర బీసీలను ఏకం చేస్తానన్నారు.

మార్చి 3న గుంటూరులో ఏపీ బీసీ నేతలతో సమావేశం నిర్వహిస్తున్నట్టు తలసాని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పోటీ చేస్తే అధికార టీడీపీ ఓట్లే చీలుతాయని జోస్యం చెప్పారు తలసాని. ఇదిలావుంటే పలుమార్లు ఏపీలో పర్యటిస్తానని చెప్పిన తలసాని అందుకు తగ్గట్టుగానే వ్యూహరచన చేస్తున్నారు. దీంతో ఏపీలో పొలిటికల్ వాతావరణం మరింత వేడెక్కే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories