జగన్‌ది పిచ్చి తుగ్లక్ పాలన: అచ్చెన్నాయుడు

జగన్‌ది పిచ్చి తుగ్లక్ పాలన: అచ్చెన్నాయుడు
x
Highlights

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 100 రోజుల్లోనే సీఎం జగన్ ప్రజల నమ్మకాన్ని వమ్ముచేశారని...

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 100 రోజుల్లోనే సీఎం జగన్ ప్రజల నమ్మకాన్ని వమ్ముచేశారని విమర్శించారు. జగన్‌ది పిచ్చి తుగ్లక్ పాలన అని పేర్కొన్నారు. ప్రజల సొమ్మును వైసీపీ కార్యకర్తలకు దోచిపెట్టాలని చూస్తున్నారన్నారు. టీడీపీ హయాంలో చేసిన పనులకు జగన్ రిబ్బన్ కట్ చేస్తున్నారని అన్నారు.

పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌కు గతంలో చంద్రబాబు శంకుస్థాపన చేశారని అన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా ప్రారంభించలేకపోయామని చెప్పారు. స్పీకర్ తమ్మినేని రాజకీయ ప్రసంగాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories