టీడీపీ ఎంపీకి సిక్కోలు యాసలో అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే అంబటి

టీడీపీ ఎంపీకి సిక్కోలు యాసలో అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే అంబటి
x
అంబటి రాంబాబు, రామ్మోహన్ నాయుడు ఫైల్ ఫోటో
Highlights

టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాసరావుపై ఐటీ దాడులు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.

టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాసరావుపై ఐటీ దాడులు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఐటీ సోదాల్లో శ్రీనివాసరావు వద్ద రూ.2 వేల కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నట్లు వెల్లడయ్యాయని వైసీపీ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా టీడీపీ, వైసీపీ నేత విమర్శలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఆదివారం టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు వైసీపీ అంబటి రాంబాబు మధ్య ట్వీటర్ వేదికగా ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది.

తొలుత ఎంపీ సిక్కోలు మాండలికంలో జగన్‌పై విమర్శలు చేయగా.. ఎమ్మెల్యే రాంబాబు కూడా అదే యాసలో కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ పై జరిపిన ఐటీ సోదాల్లో కేవలం రూ.2.63 లక్షల నగదు, 12 తులాల బంగారం మాత్రమే స్వాదీనం చేసుకున్నట్లు ఆ శాఖ తెలిపింది. దీంతో రూ. 2 వేల కోట్లు స్వాధీనం చేసుకున్న వార్తలు అవాస్తవమని ఐటీ ప్రకటనలో తేల్చింది.

జగనోరి 'సాక్షి' అబద్ధాలు అచ్చోసి కుమ్మబోతే, ఒడుపుగా ఒడిసిపట్టి దాని కొమ్ములిరిసి, దమ్ముంటే రమ్మనంటూ రొమ్ము విరిచి పిలిచినోడు.. మా చంద్రబాబు. అక్రమాల వారసుడు జగన్మోహనుడు తెలుగుదేశం ఎంట పడితే గుద్ది గుండ సేసినాడు మా చంద్రబాబు.'' అంటూ ఎంపీ రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు.

బాబొరి కథలు అన్ని అల్లి చెపుతాడు .. రొమ్ము విరిచి చంద్రబాబు సంచులెన్నో మోసాడు కెమెరాలకి సిక్కి.. బిక్కిబిక్కి పరిగెత్తి ఆంధ్రకు వచ్చినాడు.. భ్రమారావతి చెప్పి బినామీ బాగుల్ని నింపినాడు.. ఎన్నికల్లో ప్రజలు ఎత్తి 23 ఇచ్చినారు, కోడుకేమో ఒడి పాయే.. పచ్చ మీడియాకి పిచ్చెక్కే'' అంటూ వైసీపీ ఎమ్మెల్యే అంబటి కౌంటర్ ఇచ్చారు. టీడీపీ వైసీపీ నేతల మధ్య ట్విటర్ యుద్దం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories