జగన్ కు కేసినేని నాని రిక్వెస్ట్.. వాళ్ళను ఆదుకోవాలంటూ ట్వీట్

జగన్ కు కేసినేని నాని రిక్వెస్ట్.. వాళ్ళను ఆదుకోవాలంటూ ట్వీట్
x
Kesieni nani (File Photo)
Highlights

ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతండటంతో లాక్‌డౌన్ నిబంధనల్ని అధికార యంత్రాంగం మరింత కఠినం చేసింది.

ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతండటంతో లాక్‌డౌన్ నిబంధనల్ని అధికార యంత్రాంగం మరింత కఠినం చేసింది. దీంతో కూలీలు, చేతివృత్తులతో ఉపాధి లేక కష్టాలు పడుతున్నారు. లాక్‌డౌన్‌ దెబ్బకు ఉపాధి కోల్పోతున్నామంటు వాపోతున్నారు. కల్లుగీత కార్మికులు పనులు దొరక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యల్ని ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు లేఖ రాశారు.

ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు కేశినేని నాని స్పందిస్తున్నారు. కరోనా సమయంలో నాని ట్విట్టర్ లో మళ్ళీ యాక్టివ్ అయ్యారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీల కష్టాలను రాష్ట్రాల మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి సమస్యల్ని పరిష్కరించడంలో నాని తమవంతు పాత్ర పోషించారు.

ఈ లేఖను ప్రస్తావిస్తూ.. తెలుగు దేశం పార్టీ విజయావాడ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్‌లో స్పందించారు. కష్టాల్లో ఉన్న కల్లుగీత కార్మికుల్ని ఆదుకోవాలని సోషల్ మీడియాలో కోరారు. ఈ మేరకు ఎంపీ కేశినేని నాని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు వెంటనే కల్లు గీత కార్మికులను ఆదుకోండి వారు ఆకలితో అలమటిస్తున్నారు అన్నారు. ఏపీ సీఎంవో, పీఎంవో, నరేంద్ర మోదీ, కృష్ణాజిల్లా కలెక్టర్‌ను ట్యాగ్ చేశారు. అలాగే కల్లుగీత కార్మికులు రాసిన లేఖను కూడా కేశినేని నాని ట్వీట్ చేశారు.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories