చంద్రబాబు మండలికి వచ్చి చైర్మన్ ను ప్రభావితం చేశారు : టీడీపీ ఎమ్మెల్సీ

చంద్రబాబు మండలికి వచ్చి చైర్మన్ ను ప్రభావితం చేశారు : టీడీపీ ఎమ్మెల్సీ
x
Highlights

శాసనమండలిని రాజకీయ వేదికగా మార్చేశారని టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు మండలికి వచ్చి చైర్మన్ ను ప్రభావితం...

శాసనమండలిని రాజకీయ వేదికగా మార్చేశారని టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు మండలికి వచ్చి చైర్మన్ ను ప్రభావితం చేశారని ఆమె ఆరోపించారు. చంద్రబాబు ట్రాప్ లో పడకుండా సభ్యులు హుందాగా వ్యవహరించాలని టీడీపీ సబ్యులకు ఆమె సూచించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కీలకమన్న సునీత.. అన్ని ప్రాంతాల వారికి తాము అభివృద్ధి చెందాలన్న కోరిక ఉంటుందని అన్నారు. అమరావతిలో స్వచ్చందంగా వచ్చి 34 వేల ఎకరాల భూమిని ఇవ్వడం చాలా గొప్పతమని.. వాళ్ళ గొప్పతనాన్ని ఏ ప్రభుత్వం కూడా మరచిపోదని అన్నారు.

కచ్చితంగా సీఎం జగన్ రైతులకు న్యాయం చేస్తారన్న అన్నారు. మూడు ప్రాంతాల అభివృద్ధికి జగన్ కృషి చేస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. వైసీపీలో చేరేదంటూ ఏమి లేదని.. ఈ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు ఇస్తున్నామని సునీత అన్నారు. కాగా శాసనమండలిలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు సునీత. మూడు రాజధానులకు మద్దతుగా ఆమె ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినట్టు తెలిపారు. అయితే సునీతపై అనర్హత వేటు వెయ్యాలని మండలి చైర్మన్ కు టీడీపీ ఫిర్యాదు చేసింది. దీనిపై చైర్మన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories