తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు.. వైసీపీ నుంచి..

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు.. వైసీపీ నుంచి..
x
Highlights

త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకోసం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఖరారు చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ...

త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకోసం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఖరారు చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా యనమల రామకృష్ణుడు, అశోక్‌బాబు(ఉద్యోగ సంఘం మాజీ నేత(కృష్ణా)), దువ్వారపు రామారావు(విశాఖ), బీటీ నాయుడు(కర్నూలు)ను ఖరారు చేశారు. అలాగే గవర్నర్‌ కోటాలో మంత్రి ఆదినారాయణరెడ్డి సోదరుడి కుమారుడు శివనాథరెడ్డి, గవర్నర్‌ కోటాలో శమంతకమణి(అనంతపురం), స్థానిక సంస్థల కోటాలో బుద్దా నాగజగదీశ్వర్‌రావు(విశాఖ)ను చంద్రబాబు ఖరారు చేశారు. కాగా... ప్రస్తుతం ఎంపిక చేసిన వారిలో నలుగురు బీసీలు, ఇద్దరు ఓసీలు, ఒక ఎస్సీకి ఎమ్మెల్సీ అవకాశం కల్పించినట్టయింది. ఇక వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ బీసీ విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories