అడ్డొస్తే చంపడానికి కూడా వెనకాడడంలేదు: బుద్ధా వెంకన్న

అడ్డొస్తే చంపడానికి కూడా వెనకాడడంలేదు: బుద్ధా వెంకన్న
x
Highlights

ఆంధ్రప్రదేశ్ లో తీవ్రంగా ఇసుక కొరత సృష్టించారని ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఇసుక లేక భవననిర్మాణ కార్మికులు...

ఆంధ్రప్రదేశ్ లో తీవ్రంగా ఇసుక కొరత సృష్టించారని ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఇసుక లేక భవననిర్మాణ కార్మికులు ఇబ్బంది పడుతుంటే.. వైసీపీ నేతలు మాత్రం ఇసుక కొరత లేదంటూ మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఇసుక కొరతపై ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ కు కౌంటర్ గా బుద్ధ రీట్వీట్ చేశారు.. అందులో 'అయ్యా విజయ సాయిరెడ్డి గారూ... ఇసుక కొరత లేదని ట్విట్టర్ లో మీరు సెలవిచ్చారు. బాగానే ఉంది, మరి మీ మేధావి సీఎం జగన్ ఇసుక వారోత్సవాలు ఎందుకు చేస్తున్నట్టు? ట్రాక్టర్ డ్రైవర్లపై మీ వైసీపీ ఇసుక మాఫియా దాడులు చేసి ఇసుకను ఎత్తుకుపోతోంది. అడ్డొస్తే చంపడానికి కూడా వెనకాడడంలేదు' అని ట్వీట్ చేశారు.

'రాష్ట్రంలో కృత్రిమ ఇసుక కొరత సృష్టించి పందికొక్కుల్లా ఇసుకని తింటూ, భవన నిర్మాణ కార్మికులని మింగేస్తున్న మీరు ఇసుక గురించి నీతులు మాట్లాడుతున్నారా విజయసాయిరెడ్డి గారు? పిల్లి పాలు తాగుతూ ఎవరూ చూడలేదన్నట్లుగా ఉంది మీ వ్యవహారం. దమ్ముంటే ఇసుక కొరత లేదని ప్రజల్లోకి వెళ్లి చెప్పండి?' అని బుద్ధా వెంకన్న ట్విట్టర్ ద్వారా విమర్శలు కురిపించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories