వల్లభనేని వంశీ.. పార్టీ మార్పు ఖాయమా?

వల్లభనేని వంశీ.. పార్టీ మార్పు ఖాయమా?
x
Highlights

ఏపీలోని ప్రతిపక్ష టీడీపీకి నేతలను కాచుకోవడం కష్టంగా మారింది. ఓ వైపు బీజేపీ, మరోవైపు వైసీపీ పార్టీల నుంచి ఒత్తిడికి గురవుతున్నారు టీడీపీ నేతలు....

ఏపీలోని ప్రతిపక్ష టీడీపీకి నేతలను కాచుకోవడం కష్టంగా మారింది. ఓ వైపు బీజేపీ, మరోవైపు వైసీపీ పార్టీల నుంచి ఒత్తిడికి గురవుతున్నారు టీడీపీ నేతలు. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు వైసీపీ, బీజేపీ లలో చేరగా... మరికొందరు కూడా ఇదే దారిలో వెళుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే ఓ కేసు విషయంలో ఇబ్బందులు ఎదుర్కుంటున్నవల్లభనేని వంశీ త్వరలోనే పార్టీ మారడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.

శుక్రవారం వల్లభనేని వంశీ... ఎంపీ సుజనా చౌదరిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇద్దరు కలిసి ఒకే కారులో వెళ్లారు. దీంతో వంశి కూడా బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఎంపీ సుజనా చౌదరికి వంశీకి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ కారణంగానే ఆయన ఎంపీ సుజనాను కలిశారని పలువురు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories